అమిత్ షాను కలిసిన రఘురామకృష్ణరాజు

  • పార్లమెంట్ లోని అమిత్ షా కార్యాలయంలో ఆయనను కలిసిన రఘురామ
  • డిప్యూటీ స్పీకర్ గా తనను నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపానని వెల్లడి
  • కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో కూడా భేటీ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్లమెంట్ లోని అమిత్ షా కార్యాలయంలో ఆయనను కలిశానని రఘురామ తెలిపారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా తనను నామినేట్ చేసినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేశానని చెప్పారు. అమిత్ షాతో భేటీ అయిన ఫొటోలను షేర్ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కూడా రఘురామ కలిశారు.

Raghu Rama Krishna Raju
Telugudesam
Amit Shah
BJP

More Telugu News